News February 3, 2025
పార్వతీపురం: ‘సైబర్ నేరాలపై దర్యాప్తు చేపట్టాలి’

సైబర్ నేరాలపై ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఐటీ కోర్ టీం అధికారులతో సమావేశం నిర్వహించారు. సైబర్ టెక్నాలజీ మీద పోలీసు సిబ్బంది పరిణితి చెందేలా శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News January 15, 2026
సంక్రాంతి సందర్భంగా.. కొత్త లుక్లో నెల్లూరు SP

పోలీస్ గ్రౌండ్లో SP అజిత వేజెండ్ల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి భోగి, సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. SP మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ జిల్లా ప్రజల జీవితాల్లో శాంతి, సంతోషం, భద్రత, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ తరఫున జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఎప్పుడూ యూనిఫామ్లో ఉండే SP సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
News January 15, 2026
షుగర్ తగ్గాలా? తిన్న తర్వాత 10 నిమిషాలు ఇలా చేయండి!

బ్లడ్ షుగర్ లెవల్స్ను తగ్గించుకోవడానికి కఠినమైన డైట్లు, భారీ వ్యాయామాలు అవసరం లేదని AIIMSలో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కేవలం 10 ని.ల నడక మందులకన్నా బాగా పనిచేస్తుందని తెలిపారు. నడిచినప్పుడు రక్తంలోని గ్లూకోజ్ను కండరాలు ఇంధనంగా వాడుకుంటాయి. దీంతో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ సడన్గా పెరగవు. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి కాలేయంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.
News January 15, 2026
సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు

AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘పశు సంపద మనకు అసలైన సంపద. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశువులను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. పశుపక్ష్యాదులను చక్కగా చూసుకుంటే ప్రకృతి కూడా కరుణిస్తుంది’ అని పేర్కొన్నారు.


