News March 11, 2025

పార్వతీపురం స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా నియామకం

image

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మంగళవారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆంధ్రప్రదేశ్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్‌ను నియమించింది. దీంతో బాటు రాష్ట్రంలో ఉన్న 5జోన్లకు జోనల్ అధికారులను కూడా నియమించింది.

Similar News

News November 13, 2025

గంజాయి రవాణాపై ఉక్కపాదం మోపాలి: SP

image

జిల్లా పరిధిలో ఎక్కడా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని SP ఉమామహేశ్వర్ గురువారం ఆదేశించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వలన యువత, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News November 13, 2025

ప్రహారీ దాటి ఇంటి నిర్మాణాలు ఉండొచ్చా?

image

ఇంటిని, ర్యాంపులను ప్రహరీ దాటి బయటికి నిర్మించడం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. రహదారిపైకి వచ్చేలా ర్యాంపులు కట్టడం వల్ల వీధుల్లో తిరిగే ప్రజలకు, వాహనాలకు అసౌకర్యం కలుగుతుందంటున్నారు. ‘వాస్తుకు అనుగుణంగా ఇంటి గేటు లోపలే ర్యాంపు ఉండాలి. ప్రజలకు చెందాల్సిన రహదారిని ఆక్రమించడం ధర్మం కాదు. ప్రహరీ లోపల నిర్మాణాలు చేస్తేనే వాస్తు ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 13, 2025

కడప: ల్యాబ్‌లో సీతాకోకచిలుకల ఉత్పత్తి

image

కడప జిల్లాలోని వైవీయూ సరికొత్త ప్రయోగం చేపట్టింది. జంతుశాస్త్ర శాఖ ప్రయోగశాలలో క్యాపిటేటివ్ బ్రీడింగ్ ద్వారా సీతాకోక చిలుకలను ఉత్పత్తి చేసింది. వీటిని వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ గురువారం విడుదల చేశారు. ల్యాబ్ ద్వారా సీతాకోక చిలుకలను సృష్టించడం గొప్ప విషయమని కొనియాడారు. జువాలజి HOD డా.ఎస్పీ వెంకటరమణను పలువురు అభినందించారు. రిజిస్టర్ ప్రొ.పద్మ, డీన్ ప్రొ. ఏజీ దాము పాల్గొన్నారు.