News March 11, 2025
పార్వతీపురం స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మంగళవారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆంధ్రప్రదేశ్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్ను నియమించింది. దీంతో బాటు రాష్ట్రంలో ఉన్న 5జోన్లకు జోనల్ అధికారులను కూడా నియమించింది.
Similar News
News March 18, 2025
టెన్త్ పరీక్షలు.. నల్గొండ డీఈవో ముఖ్య గమనిక

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయమై ఇదివరకే అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు భయం వీడి మంచిగా పరీక్షలు రాయాలని సూచించారు.
News March 18, 2025
బయ్యారం: పరీక్షల భయంతో విద్యార్థి ఆత్మహత్య

కాకతీయ నగర్ కాలనీలో సోమవారం అజ్మీర(సాయి) మహేశ్(18) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మృతుడు సిద్దిపేట జిల్లాలోని ఓ కళాశాలలో ఫిజియో థెరఫీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హోలీ పండుగ సందర్భంగా సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
News March 18, 2025
కరీంనగర్: ఉద్యోగుల సేవలు అభినందనీయం: కలెక్టర్

తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డీ కాలనీలోని సూపరింటెండెంట్ ఇంజనీర్, నీటిపారుదల సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడంలో అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.