News August 23, 2024
పార్వతీపురం: హెల్త్ మినిస్టర్ షెడ్యూల్

హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ యాదవ్ పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు పర్యటించనున్నారు. ఉదయం 9:40 గంటలకు సీతానగరం చేరుకుని అక్కడ పీహెచ్సీని పరిశీలిస్తారు. 10:45 గంటలకు మరిపి వలస PHCని సందర్శిస్తారు. 11:35 గంటలకు పార్వతీపురం జిల్లా ఆసుపత్రి సందర్శించి అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
Similar News
News November 16, 2025
ఈ ఏడాది 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం: మంత్రి

జిల్లాలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి రైతు తన పంటను అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. గత ఏడాది 3.34లక్షల వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు.
News November 16, 2025
గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలి: కలెక్టర్

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలు, గతంలో ఇచ్చిన స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కరించిన తర్వాత SMS ద్వారా సమాచారం చేరవేస్తామని తెలిపారు.
News November 16, 2025
కుష్ఠు వ్యాధి గుర్తింపుపై స్పెషల్ డ్రైవ్: కలెక్టర్

జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధిని గుర్తించేందుకు రేపటి నుంచి 30 వరకు 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ డ్రైవ్లో ఆరోగ్య బృందాలు ప్రతి ఇంటినీ సర్వే చేస్తాయి. కుష్ఠును పూర్తిగా నయం చేయగలిగేదని, ప్రారంభంలో గుర్తించడం అత్యంత కీలకమని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి లక్షణాలు ఉన్నా పరీక్షించుకోవాలని సూచించారు.


