News April 2, 2025
పార్వతీపురం: ‘15.82 శాతం వృద్ధికి చర్యలు’

జిల్లాలో 15.82 శాతం వృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. 2024-25 వార్షిక ప్రగతిలో భాగంగా గతేడాది జీడీపీలో 16.90 శాతం జిల్లా అభివృద్ధి సాధించగా, ఈ ఏడాది 16.12 శాతంగా మెరుగుపరిచేందుకు అంచనా వేస్తూ ప్రణాళికను రూపొందించామని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రగతిపై మంగళవారం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు.
Similar News
News November 13, 2025
కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు.. చంద్రబాబు స్పష్టం

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని CM CBN స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్లో ఆయన మాట్లాడారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ విధానంలో ముందుకెళ్తున్నామని, కంపెనీల అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని తేల్చి చెప్పారు. త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
News November 13, 2025
మదనపల్లెలో ఆసుపత్రుల అవినీతిపై మంత్రికి ఫిర్యాదు

మదనపల్లె ఆసుపత్రులపై మంత్రి సత్యకుమార్ యాదవ్కు గురువారం బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ ఫిర్యాదు చేశారు. మంత్రి మదనపల్లె టమాట మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి రావడంతో కలిశారు. అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమ కార్యకలాపాలను వివరించారు. మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కుంభకోణం బయటికి రావడం, పేదతో వ్యాపారం చేస్తూ అడ్డుగోలు దోపిడీ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
News November 13, 2025
కరీంనగర్: లారీ ఢీకొని వ్యక్తి మృతి

కరీంనగర్ పద్మనగర్ బైపాస్ రోడ్డులోని ముద్దసాని గార్డెన్స్ ముందు రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట గ్రామానికి చెందిన గడ్డం ఈశ్వర్(35) స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఇతడి వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో లారీ టైర్ కింద పడ్డ ఈశ్వర్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


