News April 2, 2025
పార్వతీపురం: ‘15.82 శాతం వృద్ధికి చర్యలు’

జిల్లాలో 15.82 శాతం వృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. 2024-25 వార్షిక ప్రగతిలో భాగంగా గతేడాది జీడీపీలో 16.90 శాతం జిల్లా అభివృద్ధి సాధించగా, ఈ ఏడాది 16.12 శాతంగా మెరుగుపరిచేందుకు అంచనా వేస్తూ ప్రణాళికను రూపొందించామని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రగతిపై మంగళవారం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు.
Similar News
News October 18, 2025
అత్యాచారం కేసులో 10 ఏళ్ల శిక్ష

66 ఏళ్ల వృద్ధురాలిపై 2018లో జరిగిన అత్యాచారం కేసులో అనంతపురం జిల్లా మదిగుబ్బకు చెందిన 55ఏళ్ల పెద్దన్నకు అనంతపురం నాలుగో సెషన్స్ కోర్టు 10 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధించింది. కేసు విచారణలో 11 మంది సాక్షుల వాదనలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి హరిత తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అభినందించారు.
News October 18, 2025
NZB: కానిస్టేబుల్ హత్య.. నిందితుడిపై 60కి పైగా కేసులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. హతుడు రియాజ్ పై 60కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చైన్ స్నాచింగ్, దొంగతనాలు, గొడవలు, చోరీ కేసులు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు రియాజ్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానిస్టేబుల్ మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలిపారు.
News October 18, 2025
వరంగల్: బంద్.. ప్రైవేటు వాహనాల డ్రైవర్ల దందా..!

బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు వ్యాపార, వాణిజ్య యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. బస్సులు RTC డిపోల్లోనే ఉండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. బస్టాండ్లో వేచి చూస్తున్న ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బంద్ను అదునుగా చేసుకొని WGL, HNK నుంచి HYD ఉప్పల్కు రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.