News April 2, 2025

పార్వతీపురం: ‘15.82 శాతం వృద్ధికి చర్యలు’

image

జిల్లాలో 15.82 శాతం వృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. 2024-25 వార్షిక ప్రగతిలో భాగంగా గతేడాది జీడీపీలో 16.90 శాతం జిల్లా అభివృద్ధి సాధించగా, ఈ ఏడాది 16.12 శాతంగా మెరుగుపరిచేందుకు అంచనా వేస్తూ ప్రణాళికను రూపొందించామని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రగతిపై మంగళవారం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు.

Similar News

News November 6, 2025

బీస్ట్ మోడ్‌లోకి ఎన్టీఆర్.. లుక్‌పై నీల్ ఫోకస్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్‌లోకి మారనున్నారు. ‘NTR-NEEL’ మూవీ కోసం ఆయన లుక్ పూర్తిగా మారబోతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. తన సినిమాలో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, బియర్డ్‌ ఎలా ఉండాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గరుండి హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌తో సెట్ చేయించారు. తారక్ లుక్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.

News November 6, 2025

గద్వాల్: నేడు నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ

image

రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ ను ఉపసంహరించుకోవడం జరిగిందని కలెక్టర్ సంతోష్ గురువారం తెలిపారు. అందులో గద్వాల జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

News November 6, 2025

మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

image

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.