News March 16, 2025

పార్వతీపురం: 67 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని DEO ఎన్.తిరుపతి నాయుడు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.
➤ జిల్లాలో మొత్తం ఎగ్జాం సెంటర్లు: 67
➤ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 10,455
➤ ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు: 03
➤ సిట్టింగ్ స్క్వాడ్‌లు: 06
➤ కస్టోడియన్ సిటింగ్ స్క్వాడ్‌లు: 22
☞ అందరికీ Way2News తరఫున All The Best

Similar News

News November 22, 2025

విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

image

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

News November 22, 2025

వరంగల్ సెంట్రల్ జైలు నిర్మాణం ఎప్పుడు..?

image

నిజాం కాలం నాటి WGL సెంట్రల్ జైలు 2021లో కూల్చగా, మామునూరులో కొత్త జైలు నిర్మిస్తామని ప్రకటించినా నాలుగున్నరేళ్లుగా పనులు మొదలుకాలేదు. వెయ్యి మంది ఖైదీలను ఇతర జైళ్లకు మార్చడంతో వారి కుటుంబాలు కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు.101 ఎకరాలు కేటాయించినా బడ్జెట్ లేక పనులు నిలిచాయి. ప్రస్తుతం మామునూరులో 20 మంది ఖైదీలకు 40 మంది సిబ్బంది పని చేస్తుండగా, కొత్త జైలు నిర్మాణంపై ప్రభుత్వం స్పందించడం లేదు.

News November 22, 2025

CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

image

<>CSIR<<>>-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(NML) 67 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పోస్టును బట్టి డిప్లొమా, BSc, MSc, BE, B.Tech, M.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://nml.res.in/