News March 16, 2025
పార్వతీపురం: 67 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు

పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని DEO ఎన్.తిరుపతి నాయుడు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.
➤ జిల్లాలో మొత్తం ఎగ్జాం సెంటర్లు: 67
➤ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 10,455
➤ ఫ్లైయింగ్ స్క్వాడ్లు: 03
➤ సిట్టింగ్ స్క్వాడ్లు: 06
➤ కస్టోడియన్ సిటింగ్ స్క్వాడ్లు: 22
☞ అందరికీ Way2News తరఫున All The Best
Similar News
News November 28, 2025
SRCL: మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఇన్ఛార్జ్ కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు పాల్గొన్నారు.
News November 28, 2025
అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు: JC

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గ్యాస్ కనెక్షన్, మొదటి గ్యాస్ సిలిండర్ను సైతం ఉచితంగా అందజేయడం జరుగుతుందని JC గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దీపం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 28, 2025
జగిత్యాల: వయోవృద్ధుల కోసం జెరియాట్రిక్ సేవలు ప్రారంభం

వృద్ధులు ప్రభుత్వం అందిస్తున్న జెరియాట్రిక్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని JGTL జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ నరేష్ సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవలను ఆయన ప్రారంభించారు. ఈ విభాగంలో పూర్తి ఆరోగ్య పరీక్షలు, కౌన్సెలింగ్, డయాబెటిస్, రక్తపోటు, గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై చికిత్సతో పాటు ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.


