News March 25, 2025
పార పట్టి కూలీలతో పని చేసిన భద్రాద్రి కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం టేకులపల్లి మండలం బోడు గ్రామపంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతు సమ్మయ్య పొలంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో కలిసి పారా, పలుగు పట్టి కొద్దిసేపు పని చేశారు. అనంతరం కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం 100 రోజులు పనిని పూర్తి చేసుకోవాలని సూచించారు. రోజువారి వేతనం 300 రూపాయలు లభించేలా పనిచేయాలని సూచించారు.
Similar News
News December 6, 2025
విశాఖ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దు

విశాఖ నుండి వెళ్ళవలసిన పలు విమానాలు రద్దు అయినట్టు శనివారం ఉదయం ఇంచార్జి ఏర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు. వాటిలో ఇండిగో సంస్థకు చెందిన 6E 217 / 6E 218 BLR – VTZ – BLR, 6E 5248 / 6E 845 BOM – VTZ – MAA, 6E 557 / 6E 6585 MAA – VTZ – BOM ఆపరేషన్ రీజనల్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. వీటితో పాటు మరో 9 విమానాలను రద్దు చేశారు.
News December 6, 2025
NZB: ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడండి: MP

ప్రభుత్వ టీచర్లకు తప్పని సరి అనే నిబంధనల విషయంలో చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ను MP అర్వింద్ ధర్మపురి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం అందజేసిన ఎంపీ మాట్లాడుతూ NZBలోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వేల మంది ఉపాధ్యాయులపై ఈ టెట్ తప్పనిసరి అంశం ప్రభావం చూపుతోందని వివరించారు.
News December 6, 2025
వికారాబాద్: గ్రామాల్లో మొదలైన బేరసారాలు..!

గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. అయితే రెండో విడతలో ఈరోజు విత్ డ్రా ఉండడంతో గ్రామాలలో బేర సారాలు గట్టిగానే నడుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే విందులు వినోదాలు ఉత్సాహపరుస్తున్నారు. బేరసారాలు మాత్రం లక్షల్లో పలుకుతున్నట్లు సమాచారం. ఉప సర్పంచు పదవి ఆశిస్తున్న వారు తమ వార్డులో ప్రత్యర్థిగా నామినేషన్ వారితో సెటిల్మెంట్ ఆఫర్లు ఇస్తున్నారట. ఈరోజు ఎన్ని విత్ డ్రా లు అయితాయో చూడాలి.


