News August 17, 2024
పాలకమండళ్ల ఏర్పాటుకు అధికారుల కసరత్తు

దేవాలయాల్లో పాలకమండళ్ల ఏర్పాటుకు దేవాదాయశాఖ రంగం సిద్ధం చేస్తోంది. యాదాద్రి BNG, SRPT, NLG జిల్లాలతో సహా జనగామలోని ఆలయ పాలక కమిటీల నియామకానికి దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ సులోచన ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని 34 దేవాలయాలకు ధర్మకర్తల మండళ్ల ఎంపిక కోసం ఆసక్తి గల వారు 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
మునుగోడు: పత్తి మిల్లులో అనుమానాస్పదంగా కార్మికుడు మృతి

మునుగోడు మండలం కొంపల్లిలోని జై బిందు పత్తి కొనుగోలు కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు ముస్తఫా జాఫర్ సాఫ్ జలాలు (30) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. తహశీల్దార్ నరేష్, చండూరు సీఐ ఆదిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానం ఉన్న శార్దూల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.
News November 26, 2025
నల్గొండ: చనిపోతూ ముగ్గురికి లైఫ్ ఇచ్చారు

చండూరుకు చెందిన రైతు పాలకూరి రామస్వామి (75) బైక్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో మూడు నిండు జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవయవదానం చేశారు. మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ కుటుంబ సభ్యులకు వీసీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అవయవదానం-మహాదానం అని ఆయన పేర్కొన్నారు.
News November 26, 2025
నల్గొండ: సర్పంచ్ ఎలక్షన్స్.. ఏ డివిజన్లో ఎప్పుడంటే..

రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాలు ఉండగా వీటికి మొదటి విడత డిసెంబర్ 11న , మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పది మండలాలు ఉండగా రెండో విడత డిసెంబర్ 14న, దేవరకొండ డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాల్లో మూడో విడత డిసెంబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.


