News February 12, 2025
పాలకుర్తిలో అత్యధికం.. తరిగొప్పులలో అత్యల్పం

జనగామ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 134 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం పాలకుర్తిలో 106, రఘునాథపల్లిలో 85, బచ్చన్నపేట 81, దేవరుప్పులలో 68, జనగామ 65, లింగాలఘన్పూర్ 64, జఫర్గఢ్ 63, చిల్పూరు 62, కొడకండ్ల 61, స్టేషన్ ఘనపూర్ 56, నర్మెట్ట 41, తరిగొప్పుల 31 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
Similar News
News October 29, 2025
సిద్దిపేట: భారీ వర్షాలు.. విద్యుత్ అధికారుల హెచ్చరికలు

మొంథా తుఫాను కారణంగా సిద్దిపేట జిల్లా రెడ్ అలర్ట్లో ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోవడం, తడిసిన చేతులతో స్టార్టర్లు, మోటార్లు ముట్టుకోవడం, గాలి, దుమారం, తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోవడం వంటివి చేయవద్దని విద్యుత్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే JLM, ALM, LM, AE దృష్టికి తీసుకువెళ్లాలని విద్యుత్ అధికారులు సూచించారు.
News October 29, 2025
నిజామాబాద్: NOV 1వరకు గడువు: కలెక్టర్

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్- 2047 అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తుందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని బుధవారం ఆయన ప్రకటనలో కోరారు. సర్వేలో పాల్గొనేందుకు NOV 1వరకు గడువుందని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, భవిష్యత్ నిర్మాణంలో తమవంతు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News October 29, 2025
దైవారాధనలో ఆహార నియమాలు పాటించాలా?

దేహపోషణకే కాక, మోక్షప్రాప్తికి కూడా ఆహార నియమాలు ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆహార నియమాలు పాటించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండి, మనస్సు స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. దేవుడిపై మనస్సు లగ్నం కావాలంటే, కష్టపడి, నిజాయతీగా సంపాదించిన ఆహారాన్నే స్వీకరించాలి. దుఃఖం, కోపం, భయం కలిగించే ఆహారాలు భక్తికి ఆటంకం. కాబట్టి ఆత్మశుద్ధిని కాపాడే ఆహారం మాత్రమే భగవత్ చింతనకు, దైవ ప్రాప్తికి సహాయపడుతుంది. <<-se>>#Aaharam<<>>


