News March 19, 2025

పాలకుర్తి: అనారోగ్యం కారణంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

image

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ మారుతినగర్లో మంగళవారం ఆరే అజయ్(23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బసంతనగర్ ఎస్సై స్వామి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Similar News

News October 23, 2025

మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

image

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>

News October 23, 2025

ఎంజీయూ బీఈడీ ఫలితాలు విడుదల

image

ఎంజీయూ బీఈడీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్/బ్యాక్‌లాగ్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 4వ సెమిస్టర్‌లో 2,552 మందికి గాను 2,419 మంది (94.79%) ఉత్తీర్ణత సాధించారని సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. 2వ సెమిస్టర్‌లో 81.14 శాతం విజయం సాధించినట్లు పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ సందర్శించాలన్నారు.

News October 23, 2025

భారత్ ఓటమి

image

AUSతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఇంకో మ్యాచ్ ఉండగానే 0-2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన IND 50 ఓవర్లలో 264-9 రన్స్ చేసింది. 265 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. షార్ట్(74), కాన్లీ(61), ఒవెన్(36) రాణించారు. IND బౌలర్లలో హర్షిత్ రాణా, సుందర్, అర్ష్‌దీప్ తలో 2 వికెట్లు తీశారు. 25న సిడ్నీలో మూడో వన్డే జరగనుంది.