News March 19, 2025

పాలకుర్తి: అనారోగ్యం కారణంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

image

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ మారుతినగర్లో మంగళవారం ఆరే అజయ్(23) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బసంతనగర్ ఎస్సై స్వామి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Similar News

News November 28, 2025

WPL మెగా వేలం: తెలుగు ప్లేయర్ల హవా

image

WPL మెగా వేలంలో తెలుగు ప్లేయర్లను అదృష్టం వరించింది. కరీంనగర్(D) రామగుండంకు చెందిన శిఖా పాండే(ఆల్ రౌండర్)కు అనూహ్య ధర దక్కింది. జాతీయ జట్టులో చోటు కోల్పోయినా ఆమెను UP రూ.2.4కోట్లకు కొనుగోలు చేసింది. లేటెస్ట్ వరల్డ్ కప్ సెన్సేషన్ శ్రీచరణి రూ.1.30కోట్లకు DC సొంతం చేసుకుంది. అరుంధతిరెడ్డిని రూ.75లక్షలకు RCB, త్రిష UP, క్రాంతిరెడ్డి MI, మమత కోసం DC రూ.10 లక్షల చొప్పున వెచ్చించాయి.

News November 28, 2025

నేడు అఖండ-2 ప్రీరిలీజ్ ఈవెంట్

image

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా, మూవీ టీం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇవాళ HYDలోని కూకట్‌పల్లిలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘అఖండ’ చిత్రం ఉత్తరాదిలోనూ మంచి విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై హిందీ రాష్ట్రాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

News November 28, 2025

పంట నష్టం నివారణ చర్చలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ఏలూరు జిలాల్లో ఈనెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. పంట నష్టం నివారణ చర్యలపై అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ప్రస్తుతం కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.