News February 1, 2025
పాలకుర్తి: ఆన్లైన్ సెంటర్ సీజ్ చేసిన అధికారులు

పాలకుర్తిలో యాకేశ్ అనే వ్యక్తి కార్తీక కామన్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేస్తున్నాడు. శుక్రవారం సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రాకేశ్ తెలిపారు. ఆధార్ వివరాలు అప్డేట్ చేయడానికి ఐడీ లేకున్నా ఇతరుల ఐడీతో ఆధార్ వివరాల అప్డేట్ చేయడంతో సెంటర్ను సీజ్ చేసి 2 ల్యాప్టాప్లు, 2 ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News November 28, 2025
విజయవాడ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సకు ‘లినాక్’ పరికరం

విజయవాడ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్య సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా లీనియర్ యాక్సిలరేటర్ పరికరాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంపీ, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. ఈ అత్యాధునిక ‘లినాక్’ పరికరం సమకూర్చేందుకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.
News November 28, 2025
WPL మెగావేలం-2026: అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే

1.దీప్తీ శర్మ(UP వారియర్స్): రూ.3.2కోట్లు, 2.అమీలియా కెర్(MI): రూ.3కోట్లు
3.శిఖా పాండే(UPW): రూ.2.4కోట్లు, 4.సోఫీ డివైన్(గుజరాత్ జెయింట్స్): రూ.2కోట్లు, 5.మెగ్ లానింగ్(UPW): రూ.1.9కోట్లు, 6.చినెల్లి హెన్రీ(DC): రూ.1.30కోట్లు, 7.శ్రీచరణి(DC): రూ.1.30కోట్లు,8. లిచ్ ఫీల్డ్(UPW): రూ.1.20కోట్లు
9. లారా వోల్వార్ట్(DC): రూ.1.10కోట్లు,10. ఆశా శోభన(UPW): రూ.1.10కోట్లు
News November 28, 2025
జిల్లాలో ధాన్యం సేకరణకు 3,715 వాహనాలు: కలెక్టర్

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లాలో ధాన్యం సేకరణకు 3,715 వాహనాలను నడుపుతున్నామని కలెక్టర్ డీకే బాలాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు తెలిపారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ధాన్యం సేకరణ, గంజాయిపై అవగాహన, తదితర అంశాలపై సమీక్షించారు.


