News April 18, 2024
పాలకుర్తి: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంశీ (21) గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Similar News
News October 13, 2024
కాలేజీలు బంద్ చేస్తే చర్యలు: కేయూ రిజిస్ట్రార్
ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కళాశాలలకు విడుదలయ్యే ఫీజు రీయంబర్స్మెంట్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రేపటి నుంచి కళాశాలను బంద్ చేస్తామని రిజిస్ట్రార్కు ప్రైవేట్ యాజమాన్యాలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి హెచ్చరించారు.
News October 13, 2024
హర్యానా గవర్నర్ను కలిసిన మాజీ MLA
హైదరాబాద్లోని నాంపల్లిలో నిర్వహించిన అలాయ్.. బలాయ్ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మాజీ ఎమ్మెల్యే కలిసి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.
News October 13, 2024
MHBD: గన్తో కాల్చుకొని AR కానిస్టేబుల్ మృతి
మహబూబాబాద్ కలెక్టరేట్ లో ఆదివారం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న AR కానిస్టేబుల్ శ్రీనివాస్ గన్తో కాల్చుకొని మృతి చెందారని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.