News March 4, 2025
పాలకుర్తి: చాకలి ఐలమ్మ వారసుడిని కలిసిన పృథ్వీరాజ్

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా రాష్ట్ర క్రాంతి సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ ఆ విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 7, 2025
NMMS పరీక్షకు 86 మంది గైర్హాజరు: DEO

జిల్లాలో 12 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన జాతీయ ఉపకార వేతన(NMMS) పరీక్షను ఆదివారం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో వెల్లడించారు. 2654 మంది విద్యార్థులు హాజరుకాగా, 2568 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 86 మంది గైర్హాజరు అయ్యారని పేర్కొన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు.
News December 7, 2025
కృష్ణా: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు..!

తండ్రికి కూతురు తలకొరివి ఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది. పెడన మండలం పెనుమల్లి గ్రామంలో ఏడుకొండలు (56) అనారోగ్యంతో మరణించారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో, మూడవ కుమార్తె కళ్యాణి తండ్రి అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. కుటుంబ పెద్దల సమక్షంలో ఆమె తన తండ్రికి తలకొరివి పెట్టన దృశ్యం గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.
News December 7, 2025
పాడేరు: ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష

జిల్లా వ్యాప్తంగా ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, వీఆర్ పురం, చింతూరులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈవో పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. పరీక్ష కోసం మొత్తం 727 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 678 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష నిర్వహించామన్నారు.


