News February 18, 2025

పాలకుర్తి నియోజకవర్గంలో 6 నూతన చెక్ డ్యాములు మంజూరు

image

పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినతికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పాలకుర్తి మండలంలో 3 గ్రామాలు, కొడకండ్ల మండలంలో 2 గ్రామాలు, తొర్రూరు మండలంలో 1 గ్రామానికి మొత్తం రూ.31 కోట్లతో 6 చెక్ డ్యాములను మంత్రి మంజూరు చేశారు. ఈ సందర్భంగా MLA రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News November 6, 2025

గోపాల్‌పేట: వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాలి: చిన్నారెడ్డి

image

వందేమాతర గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం అందరూ వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.జిల్లెల చిన్నారెడ్డి కోరారు. గోపాల్‌పేట ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తనకు బిడ్డలాంటిదన్నారు. ఈ పాఠశాల ఏర్పాటు కోసం తాను ఎంతో కృషి చేసినట్లు గుర్తు చేశారు. ఈ పాఠశాలకు మరో ఎకరా స్థలాన్ని కేటాయించేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు.

News November 6, 2025

పోలికపాడు: స్థల పరిశీలన చేసిన కలెక్టర్

image

గోపాల్‌పేట్ మండలం పోలికపాడు గ్రామ పరిధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం పరిశీలించారు. ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను పరిశీలన చేశారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సంబంధిత ప్రదేశంలో కనెక్టివిటీ, సౌకర్యాల గురించి ఆరా తీశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, తహశీల్దార్ తిలక్ రెడ్డి, ఎంపీడీవో అయిషా పాల్గొన్నారు.

News November 6, 2025

GDWL: మామిడి రైతులకు సూచనలు

image

జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలను సాగు చేసే రైతులు నవంబర్ నెలలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. ఈ నెలలో తేనె మంచు, పిండి నల్లి, పొలుసు పురుగులు పంటలను ఆశ్రయిస్తాయన్నారు. పాదులు చేసి చెట్ల మొదలు చుట్టూ పాలిథిన్ పేపర్‌ను అడుగు ఎత్తున కట్టి దానికి జిగురు పూయాలన్నారు. ఫలితంగా పురుగులు పైకి పాకకుండా నియంత్రించవచ్చని సూచించారు.