News February 23, 2025
పాలకుర్తి: బ్రహ్మోత్సవాల ఏర్పాట్లును పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శనివారం అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంకా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈకార్యక్రమంలో వివిధశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
HYD: నాగోల్లో విషాదం.. దంపతుల సూసైడ్

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
News November 21, 2025
మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీ నేపథ్యం

మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీగా డా.శబరీష్ నియామకమైన విషయం తెలిసిందే. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సుధీర్ రాంనాథ్ కేకన్ ములుగు జిల్లా ఎస్పీకు బదిలీ అయ్యారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శబరీశ్ 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.
News November 21, 2025
నవంబర్ 23 నుంచి ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం

డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం, నిజామాబాదులో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్తో పాటు, పీజీ (MBA) మొదటి సెమిస్టర్, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి.
నవంబర్ 23 ఆదివారం ఉదయం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి, సమన్వయకర్త డా. కె. రంజిత తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.


