News April 11, 2025

పాలకుర్తి: మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్

image

పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తాలో నలుగురు మైనర్లు ఒకే బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎస్సై యాకూబ్ హుస్సేన్ వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Similar News

News October 23, 2025

ADB: మంట గలుస్తున్న మానవ సంబంధాలు

image

కుటుంబాలు ప్రేమ, ఆప్యాయతకు నిలువెత్తు ప్రతిరూపాలు. కానీ ఆ బంధాలు కాస్త కన్నీటి గాథలవుతున్నాయి. మంచిర్యాలలో పండుగపూటే భార్యను భర్త చంపుకోగా, జన్నారంలో మరోచోట కన్న కొడుకే తండ్రిని హతమార్చడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వివాహంపై మామ పెంచుకున్న కక్ష దహెగాంలో కోడలి ప్రాణం తీసింది. పవిత్రమైన అనుబంధాల్లో విషం నింపుతున్న ఈ ఘటనలు, నేటి సమాజంలో క్షీణిస్తున్న మానవ సంబంధాల విలువలకు అద్దం పడుతున్నాయి.

News October 23, 2025

అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షెకావత్ జననం
1979: సినీ హీరో ప్రభాస్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం

News October 23, 2025

సంగారెడ్డి: ప్రవేశాలకు నేడే చివరి గడువు: డీఈఓ

image

ఉమ్మడి జిల్లాలోనీ వర్గల్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతులలో ప్రవేశం పొందేందుకు గడువు నేటి వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు https://www.navodaya.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.