News February 19, 2025
పాలకొండకు జగన్ రాక రేపు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. ఇటీవల జడ్పీ మాజీ ఛైర్మన్ పాలవలస రాజశేఖరం చనిపోయారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు గురువారం రానున్నారు. ఈ మేరకు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.
Similar News
News March 18, 2025
శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాల పనివేళలు ఇవే..

అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి. శాంతి శ్రీ మంగళవారం తెలిపారు. వేసవి దృష్ట్యా మార్చి నెల 18వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు సమయం మార్చినట్లు పేర్కొన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు వేడి ఆహారం ఇచ్చి పిల్లలను వారి వారి గృహాలకు పంపాలని ఆమె తెలిపారు.
News March 18, 2025
కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయసు 50 – 55 సంవత్సరాలు మధ్య ఉంటుందన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 18, 2025
SKLM: కంప్యూటర్ శిక్షణను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. నగరంలోని జడ్పీ మందిరంలో 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. నూతనంగా వస్తున్న సాంకేతికతను అలవర్చుకొని నైపుణ్యాభివృద్థి చేసుకోవాలన్నారు.