News February 17, 2025

పాలకొండ: నేడు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ ఎన్నిక

image

పాలకొండ నగర పంచాయితీలో ఖాళీగా ఉన్న ఛైర్‌పర్సన్ పదవికి సబ్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నిక నిర్వహించనున్నారు. ఇదివరకే పాలకొండ ఛైర్‌పర్సన్ పదవి కోసం రెండుసార్లు ఎన్నిక జరగ్గా వివిధ కారణాలు రీత్యా వాయిదా పడింది. దీంతో మూడోసారి ఈ ఎన్నిక నిర్వహించేందుకు నేడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక కొలిక్కి వస్తుందా లేదా అని నగర పంచాయతీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News October 13, 2025

వైసీపీ నేరాలను టీడీపీపైకి నెట్టే కుట్ర: చంద్రబాబు

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో జరిగిన భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే నకిలీ మద్యం కేసూ ఉందన్నారు. అంతా వాళ్లే చేసి తమపై నింద మోపుతున్నారని చెప్పారు. క్రిమినల్ మాస్టర్ మైండ్‌కు జగన్ ఉదాహరణ అని, వైసీపీ క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాళ్ల నేరాలను టీడీపీపై నెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

News October 13, 2025

కేజీహెచ్‌లో ఫుట్ స్కానింగ్ పరీక్షలు

image

కేజీహెచ్‌లోని ఫుట్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు పరికరాన్ని సిద్ధం చేశారు. ఇప్పటివరకు హైదరాబాదులో మాత్రమే అందుబాటులో ఉండే ఈ పరికరం కేజీహెచ్‌లోని మెడిటెక్ జోన్ సహకారంతో అందుబాటులోకి తెచ్చారు. ఈ పరికరాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ప్రారంభించగా.. పీజీ విద్యార్థులకు, వైద్యులకు మొదటగా పరీక్షలు చేశారు. పాదాల్లో దీర్ఘకాలిక సమస్యలు, మార్పులు గమనించి చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.

News October 13, 2025

HYD: ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు నంబర్ వన్!

image

చర్లపల్లి జైలును ఈరోజు సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శమన్నారు. ఖైదీలకు బీమా, కుటుంబ సభ్యులకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ అద్భుతమని, ఖైదీల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని సూచించారు.