News February 20, 2025

పాలకొండ: విక్రాంత్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన YS జగన్ 

image

ఎమ్మెల్సీ విక్రాంత్ కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం పాలకొండ పట్టణానికి చేరుకొని కుటుంబ సభ్యులను కలిశారు. దివంగత పాలవలస రాజశేఖర్ మృతి బాధాకరమని ఆయన అన్నారు. వారి కుటుంబ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ విక్రాంత్ బాబులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాలవలస కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

Similar News

News November 6, 2025

సంగారెడ్డి: చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

image

చీమలకు భయపడి వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) మైర్మేకోఫోబియా‌తో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్‌(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News November 6, 2025

ఇదేం నిబంధన.. ‘7 క్వింటాళ్ల పరిమితిపై’ రైతుల ఆవేదన

image

ఖమ్మం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి సేకరణలో ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడంపై ఉమ్మడి జిల్లా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ‘దిక్కుమాలిన నిబంధన.. ఏడ్చినట్టే ఉంది’ అని రైతులు మండిపడుతున్నారు. తేమశాతం, పింజ పొడవు నిబంధనలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కడ అమ్ముకోవాలని వారు సీసీఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

News November 6, 2025

గన్నవరం: ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

image

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల నుంచి ఎంపికైన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తొలిసారి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. దీంతో చిన్నారులు భావోద్వేగానికి లోనయ్యారు. సమగ్ర శిక్షా, ఏపీ సైన్స్ సిటీ సంయుక్తంగా చేపట్టిన మూడు రోజుల సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో భాగంగా జాతీయ మ్యూజియం, ప్లానెటోరియం సందర్శిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు.