News February 25, 2025
పాలకొండ: 12 ఏళ్లలో నలుగురు దొరికారు

పాలకొండ నగర పంచాయతీ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పాలకొండలో ఇప్పటివరకు 16మంది కమిషనర్లు పని చేశారు. అందులో నలుగురు ACBకి పట్టుబడ్డారు. 2013లో పి.నాగభూషణరావు, 2015లో టి.కనకరాజు, 2021లో నడిపేన రామారావు, ఇప్పుడు సర్వేశ్వరరావు రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
Similar News
News December 6, 2025
టాస్ గెలిస్తే.. సిరీస్ గెలిచినట్లే!

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా ఇవాళ టాస్ గెలవాలి. మొదట బ్యాటింగ్ చేసి ఎంత భారీ స్కోర్ చేసినా.. రెండో ఇన్నింగ్స్లో మంచు దెబ్బకు బౌలింగ్ తేలిపోతోంది. ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్లో విశాఖలో జరిగిన 5 ODIల్లో ఛేజింగ్ టీమే గెలిచింది. ఏ విధంగా చూసినా ఇవాళ్టి మ్యాచ్లో టాసే కీలకంగా కనిపిస్తోంది.
News December 6, 2025
ఇండిగో.. రిఫండ్ చేస్తే సరిపోతుందా?

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో వేలమంది ఇబ్బంది పడ్డారు. CEO సారీ కూడా చెప్పారు. టికెట్ డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. చాలామంది జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో వాళ్లు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్స్ రిఫండ్ చేస్తాయో లేదో తెలీదు. వేరే ఫ్లైట్స్కి వెళ్లిన వాళ్లు రూ.7 వేల టికెట్ని రూ.50 వేలకు కొన్నారు. ఇలా ఏదోలా ప్రయాణికులు నష్టపోయారు. మరి ఇండిగో కేవలం టికెట్ డబ్బు రిఫండ్ చేస్తే సరిపోతుందా? COMMENT.
News December 6, 2025
బాలిక విన్నపంపై స్పందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో నాల్గో తరగతి బాలిక ఐశ్వర్య తమ ఇంటి పట్టా సమస్యను ఎమ్మెల్యే సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తహశీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, టీడీపీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. ఐశ్వర్య కుటుంబానికి తక్షణమే ఇంటి పట్టా మంజూరు చేశారు. విద్యార్థి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.


