News February 25, 2025
పాలకొండ: 12 ఏళ్లలో నలుగురు దొరికారు

పాలకొండ నగర పంచాయతీ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పాలకొండలో ఇప్పటివరకు 16మంది కమిషనర్లు పని చేశారు. అందులో నలుగురు ACBకి పట్టుబడ్డారు. 2013లో పి.నాగభూషణరావు, 2015లో టి.కనకరాజు, 2021లో నడిపేన రామారావు, ఇప్పుడు సర్వేశ్వరరావు రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
Similar News
News March 20, 2025
జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
News March 20, 2025
జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
News March 20, 2025
NLG: బడ్జెట్లో జిల్లాకు పెరిగిన ప్రాధాన్యం

రాష్ట్ర వార్షిక బడ్జెట్లో జిల్లాకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరిగింది. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో కాస్త ఎక్కువ నిధులు కేటాయించింది. డిండి ఎత్తిపోతల పథకానికి, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ వంటి ప్రాజెక్టులకు నిధులు పెంచింది. జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రగతి పద్ధతి కింద రూ.1,600 కోట్లు కేటాయించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.