News December 14, 2024
పాలకోడేరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి-ఎస్సై

సోంపల్లి శివాలయం సమీపంలో గురువారం రాత్రి రెండు మోటర్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో గాయపడిన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకు చెందిన కొరత్తిక బాబి కాకినాడ జీ.జీ.హెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాబి సొంత పనుల నిమిత్తం పల్సర్ బైక్పై మండపేట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మృతుని తల్లి దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రాజోలు ఎస్ఐ రాజేష్ తెలిపారు.
Similar News
News November 18, 2025
ఆకివీడు: ఆన్లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

ఆకివీడులో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్స్టాగ్రామ్లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.
News November 18, 2025
ఆకివీడు: ఆన్లైన్ మోసం.. 39వేలు పోగొట్టుకున్న మహిళ

ఆకివీడులో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. ఇన్స్టాగ్రామ్లో “రూ. 999కే మూడు డ్రెస్సులు” అనే ఆఫర్ నమ్మిన ఓ గృహిణి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దఫదఫాలుగా రూ.39 వేలు పోగొట్టుకున్నారు. బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ధర్యాప్తు చేస్తున్నారు.
News November 18, 2025
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్ నాగరాణి

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ, సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సీ, సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26 వరకు అభ్యర్థులు https:/apstudycircle.apcfss.in వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.


