News March 31, 2025
పాలమూరు: ఒకే వేదికపై మూడు పార్టీల నేతలు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకే వేదికపై మూడు పార్టీల నేతలు కలిశారు. సోమవారం నారాయణపేట జిల్లాలో రంజాన్ పండుగా సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, బీజేపీ నేత నాగురావు నామాజీలు రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 9, 2026
నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రైతుల పచ్చజెండా

నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రైతులు పూర్తిస్థాయిలో అంగీకారం తెలిపారు. దౌల్తాబాద్ సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు వివిధ మండలాల రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు. సుమారు రూ.4,885 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 32 గ్రామాల్లోని 23,758 ఎకరాలకు సాగునీరు అందనుంది.
News January 9, 2026
మూసీ ప్రాజెక్ట్కు 200 ఎకరాల అదనపు సేకరణ

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాపుఘాట్ పరిసరాల్లోని సుమారు 200 ఎకరాల డిఫెన్స్ భూమిని సేకరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భూమి లభిస్తే, నది వెడల్పును పెంచడంతో పాటు అక్కడ భారీ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ హబ్ను, అంతర్జాతీయ స్థాయి వాక్-వేలను నిర్మించవచ్చని ఓ అధికారులు Way2News కు తెలిపారు.
News January 9, 2026
మేడారంలో ప్రకృతే దైవం..! అందుకే ఇంతటి ప్రాశస్థ్యం..!!

గిరిజన గూడెంలో జరిగే మేడారం జాతర కోట్ల మందికి విశ్వాసంగా మారడానికి కారణం ఇక్కడి స్వచ్ఛమైన, కల్మషం లేని ఆదివాసుల సంస్కృతి. తమకు జీవనాధారం అయిన ప్రకృతిని దైవంగా ఆరాధించడమే. ఇలవేల్పులు సమ్మక్క- సారలమ్మలను కుంకుమ బరిణ రూపంలో చూసుకోవడం. ఆకలి తీర్చే చెట్టు, దాహం తీర్చే వాగు, సాయం చేసే పశువులు, స్నేహం చేసే పక్షులను దేవుళ్లుగా భావిస్తారు. అందుకే జాతర రెండేళ్లకోసారి జరిగినా వనమంతా జన గుడారం అవుతుంది.


