News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
Similar News
News January 10, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★ఇచ్ఛాపురం: గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్.
★పలాసలో కొండలు, చెరువులు మాయం అవుతున్నాయి: సీదిరి
★బట్టేరు: గొంతు తడవాలంటే.. కావిడి పట్టాల్సిందే
★శ్రీకాకుళం: పెరిగిన ప్రయాణీకుల రద్దీ
★ఇచ్ఛాపురంలో బీభత్సం సృష్టించిన దొంగలు
★శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో మరమ్మతుల పనులు
★ కొత్తూరు: రహదారిపై బస్సు..వెళ్లేదెలా బాసు
News January 10, 2026
కమనీయం.. కొత్తకొండ వీరభద్రుడి కల్యాణం

కొత్తకొండ వీరభద్ర స్వామి కల్యాణం శనివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ కల్యాణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం అనంతరం భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకువచ్చి వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
News January 10, 2026
రేపు సూళ్లూరుపేట రానున్న హీరోయిన్ హెబ్బా.!

సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఫుల్ జోష్లో నడుస్తోంది. సెలబ్రిటీల రాకతో ఈ ఈవెంట్ మరింత కోలాహలంగా మారింది. ఇవాళ హైపర్ ఆది, రైజింగ్ రాజు, యాంకర్ సమీర సందడి చేయగా రేపు కార్యక్రమాలు మరింత సందడిగా సాగనున్నాయి. ఇందులో భాగంగా హీరోయిన్ హెబ్బా పటేల్ రానున్నారు. ఆమెతోపాటు యాంకర్ సాకేత్, ఇతర డాన్స్ బృందం ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు.


