News March 27, 2025

పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.

Similar News

News November 26, 2025

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలి: ఆది శ్రీనివాస్

image

మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా, వేములవాడ పట్టణంలో 8,871 స్వయం సహాయక బృందాలకు (SHGలకు) రూ. 8 కోట్ల 12 లక్షల విలువైన చెక్కులను మంగళవారం ఆయన ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

News November 26, 2025

HYD: ఈషా సింగ్‌ను అభినందించిన ఏడీజీ

image

ఉమెన్ షూటర్ ఈషా సింగ్ డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కైరోలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2 రజతాలతో మెరిసిన ఈషాను అధికారులు అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి 700 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీలో ఆమె సాధించిన విజయం పట్ల భగవత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News November 26, 2025

HYD: ఈషా సింగ్‌ను అభినందించిన ఏడీజీ

image

ఉమెన్ షూటర్ ఈషా సింగ్ డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కైరోలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2 రజతాలతో మెరిసిన ఈషాను అధికారులు అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి 700 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీలో ఆమె సాధించిన విజయం పట్ల భగవత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.