News March 27, 2025

పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.

Similar News

News November 14, 2025

NRPT: గర్భిణీలకు వరంగా 102 అమ్మబడి సేవలు

image

నారాయణపేట జిల్లాలో గర్భిణీలు, ప్రసూతి స్త్రీల కోసం 102 అమ్మ ఒడి వాహనాలు నిరంతరం సేవలు అందిస్తున్నాయని అధికారులు తెలిపారు. మక్తల్, మద్దూర్, నారాయణపేట, మరికల్, ధన్వాడ, కోస్గి మండలాలకు కలిపి మొత్తం 8 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సూపర్వైజర్ రాఘవేంద్ర ప్రజలు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. గర్భిణీలకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రజలు జీవీకే సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

News November 14, 2025

బాల్య వివాహాలపై సమాచారం ఉంటే 1098‌కి ఫిర్యాదు చేయాలి: కలెక్టర్

image

బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సేవలు అధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బాలల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం సర్వేవల్, పార్టిసిపెంట్, డెవలప్మెంట్, ప్రొటెక్షన్ హక్కులను కల్పించిదని అని తెలిపారు.

News November 14, 2025

CII Summit: రూ.7,14,780 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

image

విశాఖ సీఐఐ సమ్మిట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో వివిధ కంపెనీలతో మొత్తం 75 ఎంఓయూలు చేసుకుంది. నిన్న 35 ఒప్పందాల ద్వారా రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులు, ఈరోజు 40 కంపెనీలతో రూ. 3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా 5,42,361 ఉద్యోగాలు రానున్నాయి. ఇవి కాకుండా మంత్రి నారా లోకేశ్ సహా వివిధ శాఖల మంత్రులు మరిన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు.