News April 5, 2025

పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

image

ఏప్రిల్ 27న వరంగల్‌లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.

Similar News

News April 9, 2025

త్వరలో ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్స్ మోత

image

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపైనా త్వరలోనే టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. USకు దిగుమతయ్యే ఔషధ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు తప్పక ఉంటాయన్నారు. USలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావట్లేదని, అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధాలపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. IND సహా పలు దేశాలపై US ఇప్పటికే టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.

News April 9, 2025

అమరావతి-HYD గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

image

AP: విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. త్వరలోనే అమరావతి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలవుతుందని సమాచారం.

News April 9, 2025

ఎట్టకేలకు ఆ నరహంతకుడిని తీసుకొస్తున్నారు!

image

ముంబై టెర్రర్ అటాక్ సూత్రధారి తహవూర్ రాణాను NIA అధికారులు భారత్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికారులు USకు చేరుకున్నట్లు సమాచారం. ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తీసుకువచ్చే అవకాశముంది. ఢిల్లీలోని NIA హెడ్ క్వార్టర్స్‌లో అతడిని విచారించనున్నారు. ఇప్పటికే అక్కడ భద్రత పటిష్ఠం చేశారు. కాగా పాక్‌కు చెందిన రాణా తనను భారత్‌కు అప్పగించొద్దని కోరగా US సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!