News April 15, 2025
పాలమూరు: మత్తు మందు ఇచ్చి.. బాలికపై అత్యాచార యత్నం!

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కోయిలకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు HYD నుంచి ఒంటరిగా వచ్చింది. MBNR చేరుకున్న ఆమె ఓ యువకుడి బైక్ ఎక్కి ఊరికి వెళ్తుండగా మార్గం మధ్యలో మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకున్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News April 24, 2025
జగిత్యాల : మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు: జీవన్రెడ్డి

JGTL ఇందిరాభవన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మామిడి రైతులు మార్కెట్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేడర్లు నిబంధనలు పాటించక, మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపంతో రైతులపై భారం పడుతుందని తెలిపారు. కమీషన్ల దోపిడీ, నాణ్యత, గ్రేడింగ్ పేరుతో నష్టం, మౌలిక వసతుల లోపం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
News April 24, 2025
మల్యాలలో భూభారతి అవగాహన సదస్సు

మల్యాల మండలం ముత్యంపేట గ్రామం రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈరోజు భూభారతి పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News April 24, 2025
పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఉండవు: బీసీసీఐ

ఇకపై భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఉండబోవని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. IND, PAK మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ICC టోర్నీల్లో మాత్రమే IND, PAK తలపడుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఇక భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించవద్దని BCCI నిర్ణయించినట్లు తెలుస్తోంది.