News September 27, 2024

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జీవో తెచ్చింది నేనే: డీకే అరుణ

image

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు జీవో తెచ్చింది తానేనని, జీవో వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉదండాపూర్ భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఎంపీ డీకే అరుణ గురువారం అన్నారు. గత ప్రభుత్వం భూ నిర్వాసితు సరైన న్యాయం చేయలేదన్నారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి ప్యాకేజీ అందించాలని ఆమె అన్నారు. సిగ్నల్ గడ్డ వద్ద రోడ్డు అస్తవ్యస్తంగా తయారైందని ఆమె అన్నారు.

Similar News

News October 22, 2025

రేపు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల కోఆర్డినేషన్ మీటింగ్

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు కోనేరు వద్ద ఉన్న కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లు సహా తదితర ముఖ్య అంశాలపై సమీక్షించనున్నారు.

News October 21, 2025

పాలమూరు వర్శిటీ.. దేశవ్యాప్తంగా వినిపించాలి:VC

image

పాలమూరు వర్శిటీ పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా పథకాలు సాధించాలని వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆర్చరీ పురుషుల జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. సౌత్ జోన్(ఆల్ ఇండియా ఇంటర్ వర్శిటీ) టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆర్చరీ జట్టు గురుకాసి వర్శిటీ పంజాబ్‌కు బయలుదేరారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, అసోసియేట్ ప్రొ.డాక్టర్ ఎన్.కిషోర్,PD శ్రీనివాసులు పాల్గొన్నారు.

News October 21, 2025

నవాబుపేట: క్షతగాత్రుడి వివరాలు తెలిస్తే చెప్పండి

image

నవాబుపేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవాలయ సమీపంలో రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ఓ వ్యక్తి కిందపడ్డాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయాల పాలైన ఆ వ్యక్తి ఆచూకీ తెలిస్తే.. 8712659340 సమాచారం ఇవ్వాలని ఎస్సై విక్రం మంగళవారం తెలిపారు.