News March 28, 2025
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాక్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాకిచ్చింది. జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. కాగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. కోర్టు వివాదం నేపథ్యంలో తెలంగాణ పంపిన ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది.
Similar News
News November 15, 2025
మరో కీలక మావో లొంగుబాటు?

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.
News November 15, 2025
HYD: BRSకు BYE.. BYE: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ BRS టార్గెట్గా ట్వీట్ చేసింది. ‘మొన్న గ్రామాలు.. నేడు HYD సిటీ BRSకు బై.. బై చెప్పాయి.. గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నారు.. రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఇక కనుమరుగు అవుతుంది’ అంటూ పేర్కొంది. కాగా HYD ప్రజలు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ వైపే ఉన్నారన్న దానికి ఈ గెలుపు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అన్నారు.
News November 15, 2025
HYD: BRSకు BYE.. BYE: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ BRS టార్గెట్గా ట్వీట్ చేసింది. ‘మొన్న గ్రామాలు.. నేడు HYD సిటీ BRSకు బై.. బై చెప్పాయి.. గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నారు.. రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఇక కనుమరుగు అవుతుంది’ అంటూ పేర్కొంది. కాగా HYD ప్రజలు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ వైపే ఉన్నారన్న దానికి ఈ గెలుపు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అన్నారు.


