News April 10, 2025

పాలమూరు: 4 రోజులు.. ప్రకృతి అందాలు చూసొద్దాం..!

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధి సళేశ్వరం లింగమయ్య జాతరను ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జాతరకు ముందే లక్షలాది మంది ప్రజలు తరలివెళ్తున్నారు. కాగా నాలుగు రోజులు సా.6గంటల వరకే అనుమతి ఉంటుందని, ఈ టైమింగ్స్‌ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి సహకరించాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ గుడిని ఏటా ఒకసారి మాత్రమే చూసేందుకు అవకాశం లభించడంతో ప్రజలు పోటెత్తారు.  

Similar News

News December 5, 2025

KNR: TALLY.. రిజిస్ట్రేషన్ల గడువు పొడిగింపు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని TASK ఆఫీస్‌లో TALLY ERP 9 విత్ GSTలో శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ల గడువును DEC 12 వరకు పొడిగించినట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు కరీంనగర్ IT టవర్ మొదటి అంతస్తులోని TASK కార్యాలయంలో సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. TALLY నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఇది సువర్ణవకాశమని అన్నారు. అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 5, 2025

మీరు ఇలాగే అనుకుంటున్నారా?

image

మనం అనేక వ్రతాలను ఆచరిస్తాం. ఏదో ఒక రోజున మన కోరిక నెరవేరినప్పుడు, అది చివరి సారి చేసిన వ్రత ఫలితమే అనుకుంటాము. ఆ ఒక్క వ్రతాన్నే గొప్పదని భావిస్తాము. అంతకుముందు చేసిన వ్రతాల శక్తిని తక్కువగా అంచనా వేస్తాము. కానీ, ఈ విజయం అన్ని వ్రతాల సంచిత ఫలితమని గ్రహించాలి. ఒక దుంగ నూరవ దెబ్బకు పగిలితే, అందుకు మొదటి 99 దెబ్బలు ఎలా కారణమవుతాయో మనం చేసిన చిన్న చిన్న వ్రతాల ఫలితాలు కూడా అంతే. ఏ వ్రతం చిన్నది కాదు.

News December 5, 2025

కృష్ణా: మెగా PTM-3.0 కార్యక్రమానికి సర్వం సిద్ధం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 2500లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మెగా PTM-3.0 నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రగతిని తెలుసుకోనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారీ భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ గాంధీ హైస్కూల్‌కు దాతలు ఉచితంగా 6 లాప్‌టాప్‌లను అందించారు. జిల్లాలో ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.