News September 6, 2024

పాలమూరు: NH-44పై పెరుగుతున్న ప్రమాదాలు !

image

ఉమ్మడి పాలమూరు నుంచి వెళ్తున్న హైవే- 44 దేశంలోనే ప్రత్యేకమైనది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్‌లో ప్రారంభమై.. తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని బాలనగర్ నుంచి అలంపూర్ చౌరస్తా వద్ద ముగుస్తుంది. కాగా జాతీయ రహదారిలో ప్రతి ఏడాది ప్రమాదాలు పెరుగుతున్నాయి. గతేడాది 85 ప్రమాదాలు జరిగ్గా.. 35 మంది చనిపోయారు. 463 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈడాది ఇప్పటికే 10 మందిపైగా చనిపోయారు.

Similar News

News October 29, 2025

MBNR: నూతన ఇంజనీరింగ్ కళాశాల..100% అడ్మిషన్స్:VC

image

పాలమూరు వర్సిటీలోని నూతనంగా ఏర్పడ్డ ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలో ఏర్పడడం సంతోషంగా ఉందని, ఇంజినీరింగ్ కళాశాలలో 100% అడ్మిషన్స్ జరిగాయని ఉపకులపతి (VC) జిఎన్ శ్రీనివాస్ అన్నారు. స్నాతకోత్సవం సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. జనవరిలో నాక్ పీర్ టీం విజిట్ చేసి బి-గ్రేడ్ ఇవ్వడం జరిగిందని, గ్రంథాలయంలో కొత్త పుస్తకాలు ఏర్పాటు చేశామని, నాన్ టీచింగ్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.

News October 29, 2025

పాలమూరుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాక

image

జిల్లా కేంద్రానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం రానున్నట్లు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. టీఆర్పీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం, నియామక పత్రాలు, బీసీల రిజర్వేషన్లు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ విధి విధానాలు, తీరుతెన్నులు తదితర విషయాలపై కార్యక్రమం ఉందన్నారు.

News October 29, 2025

MBNR: భారీ వర్షాలు.. ఎస్పీ కీలక సూచనలు

image

MBNRలోని పలుచెరువులను జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.
✒భారీ వర్షాల కారణంగా చెరువులు,వాగులు పొంగిపొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✒చేపల వేటకు, సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించకూడదు
✒చిన్నపిల్లలను, వృద్ధులను నీటి ప్రాంతాల వద్దకు వెళ్లనీయకూడదు
✒వర్షపు నీరు ఎక్కువగా చేరిన రోడ్లు, లోతైన మడుగులు, డ్రైన్లను దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు.