News June 7, 2024
పాలిటెక్నిక్ కౌన్సిలింగ్కు 2,307 మంది హాజరు

పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన పాలీసెట్ -2024 కౌన్సిలింగ్కు మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు 2,307 మంది హాజరయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన గురువారం నిర్వహించగా, 256 మంది హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీలు 181, ఎస్సీ ఎస్టీలు 75 మంది ఉన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి.దామోదర్ రావు తెలిపారు.
Similar News
News May 7, 2025
ఎచ్చెర్ల: సీఎం పర్యటనకు.. గట్టి పోలీసు బందోబస్తు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శనివారం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలోని పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి నేతృత్వంలో పోలీసు బందోబస్తు విధి నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నలుగురు ఏఎస్పీలు, ఎనిమిది మంది డిఎస్పీలతో సహా ఇతర పోలీసు అధికారులతో మొత్తానికి 1500 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు.
News April 25, 2025
శ్రీకాకుళం: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు పథక సమన్వయకర్త శశిభూషణ్ గురువారం తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల విద్యార్థుల సమీప స్కూళ్లలో 25 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 9703585990 నంబరుని సంప్రదించాలని పేర్కొన్నారు.
News April 25, 2025
బుడగట్లపాలెం : సీఎం చేతుల మీదుగా రూ. 250 కోట్ల పంపిణీ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మత్స్యకార భరోసా పథకం కింద 250 కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుడగట్లపాలెంలో గురువారం ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 26న నిధులు పంపిణీకి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.