News April 24, 2025
పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 10 సెంటర్లు: డీఆర్వో

పాలీసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో డీఆర్వో పాలిసెట్-2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లు, సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 30న జరగనున్న పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 18 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News April 24, 2025
భీమవరంలో యాంకర్ అనసూయ సందడి

భీమవరంలో సినీనటి అనసూయ సందడి చేశారు. గురువారం భీమవరంలోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె వచ్చారు. అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. భీమవరం చాలా సార్లు వచ్చానని, ఇక్కడ అభిమానం ఎప్పటికీ మరవలేనని, ఎన్నిసార్లు అయినా భీమవరం వస్తానని అనసూయ అన్నారు.
News April 24, 2025
యలమంచిలిలోని కొంతేరులో హత్య

యలమంచిలి మండలం కొంతేరులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. సరిహద్దు గొడవల నేపథ్యంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కత్తుల పౌలు (58)ను బత్తుల ఏసుదాసు నరికాడు. మెడపై తీవ్రగాయాలు కావడంతో పౌలు మంచంపై మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేద, పాలకొల్లు రూరల్ సీఐ జి. శ్రీనివాస్, ఎస్సై కె. గుర్రయ్య పరిశీలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News April 24, 2025
ప.గో జిల్లా టాపర్ ఈ బాలికే..!

నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతీ బా పూలే గురుకుల పాఠశాల (బాలికలు)విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రావి అశ్విని 592 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సీహెచ్ కె. శైలజ తెలిపారు. పెరవలి గ్రామానికి చెందిన అశ్విని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ ఉంటారు.