News April 10, 2024
పాలీసెట్-2024 పరీక్ష విధానం ఇలా..!
వనపర్తి: మే 24న పాలీసెట్-2024 రాత పరీక్ష ఉంటుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుందని, గణితం 60 నిమిషాలు, భౌతిక శాస్త్రం 30 నిమిషాలు, రసాయన శాస్త్రం 30 నిమిషాల వ్యవధిలో జవాబులు రాయవలసి ఉంటుందని అన్నారు. 9,10 వ తరగతి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయని ఆయన తెలిపారు.
Similar News
News October 1, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా రేమద్దులలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ఐజలో 35.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా దోనూరులో 35.6 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దూరులో 34.8 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మంగనూరులో 34.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి.
News October 1, 2024
MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిలు !
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే ఉన్నారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలను అవగాహన కల్పిస్తూ.. స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO పద్మా తెలిపారు.
News October 1, 2024
శ్రీశైలంలో 880.4 అడుగుల నీటిమట్టం
శ్రీశైలం జలాశయంలో సోమవారం నీటిమట్టం 880.4 అడుగుల వద్ద 190.3330 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తం 81,607 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.335 M.U విద్యుదుత్పత్తి చేస్తూ 36,163 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 5.356 M.U ఉత్పత్తి చేస్తూ 22,197 మొత్తం 58,360 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్ కు విడుదల చేస్తున్నారు.