News August 10, 2024
‘పాలేరు నుండి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధి చేయాలి’

పాలేరు నుండి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధిపై పర్యాటకశాఖ మంత్రి జూపల్లికి మంత్రి తుమ్మల ప్రతిపాదనలు చేశారు. ఫీల్డ్ విజిట్ చేయాలని జూపల్లిని మంత్రి తుమ్మల ఆహ్వానించారు. ఈ నెల 12న జిల్లాలో జూపల్లి పర్యటన ఉన్న నేపథ్యంలో తుమ్మల మాట్లాడారు. పాలేరు రిజర్వాయర్ అభివృద్ధి, కూసుమంచి శివాలయం, నేలకొండపల్లి బౌద్దస్తూపం, ఖమ్మం ఖిల్లాపై రోప్ వే, భక్త రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి ప్రతిపాదనలు చేశారు.
Similar News
News April 16, 2026
ఖమ్మం: ఫైర్ సిబ్బందికి ‘విశిష్ట సేవ’ పురస్కారాలు

అగ్నిమాపక సేవల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన ఇద్దరు సిబ్బంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పురస్కారాలకు ఎంపికయ్యారు. కేంద్ర ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ విభాగం ప్రకటించిన ‘బ్రాంజ్ డిస్క్’, ప్రశంసాపత్రాలను వైరాకు చెందిన లీడింగ్ ఫైర్ ఫైటర్ గద్దె కృష్ణ ప్రసాద్, ఖమ్మంకు చెందిన వాగదాని రాంబాబు అందుకోనున్నారు. రాష్ట్రంలో 10 మందికి ఈ గౌరవం దక్కగా, అందులో జిల్లా నుంచి ఇద్దరు ఉండటం విశేషం.
News April 16, 2026
ఖమ్మం: ఫైర్ సిబ్బందికి ‘విశిష్ట సేవ’ పురస్కారాలు

అగ్నిమాపక సేవల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన ఇద్దరు సిబ్బంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పురస్కారాలకు ఎంపికయ్యారు. కేంద్ర ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ విభాగం ప్రకటించిన ‘బ్రాంజ్ డిస్క్’, ప్రశంసాపత్రాలను వైరాకు చెందిన లీడింగ్ ఫైర్ ఫైటర్ గద్దె కృష్ణ ప్రసాద్, ఖమ్మంకు చెందిన వాగదాని రాంబాబు అందుకోనున్నారు. రాష్ట్రంలో 10 మందికి ఈ గౌరవం దక్కగా, అందులో జిల్లా నుంచి ఇద్దరు ఉండటం విశేషం.
News April 16, 2026
ప్రజాపాలనతో గ్రామాల్లో మార్పు రావాలి: కలెక్టర్ అనుదీప్

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో గ్రామాల్లో మార్పు తీసుకురావాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కూసుమంచిలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు మంజూరైన 16,500 ఇందిరమ్మ ఇళ్లలో 10 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చూడాలని, స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.


