News March 1, 2025
పాల్వంచ: సదరం కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..

ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కోసం యూడీఐడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. శనివారం సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్ఎంవో రమేశ్తో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
Similar News
News March 27, 2025
ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో MBA, MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(Y21-24 బ్యాచ్) రెగ్యులర్ & సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఏప్రిల్ 17 నుంచి నిర్వహించనున్నట్లు KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 2లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలన్నారు. షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
News March 27, 2025
ఐ.పోలవరం: అత్తింటి వేధింపులు..4 నెలల గర్భిణి సూసైడ్

తాళ్లరేవులోని గండివారిపాలెంలో 4 నెలల గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరంలోని జి. వేమవరానికి చెందిన ప్రవళ్లిక (21)కు తాళ్లరేవుకు చెందిన రాంబాబుతో ఏడాది క్రితం పెళ్లైంది. కొన్ని నెలలుగా అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధిస్తున్నారని యువతి తండ్రి ఆరోపించారు. దీంతో గర్భిణి అయిన తన కుమార్తె ఆత్నహత్య చేసుకుందని విలపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News March 27, 2025
IPL బ్రాండ్ వాల్యూ రూ.లక్ష కోట్లు

ఇండియాలో అతిపెద్ద ఫ్రాంచైజీ ఈవెంట్ అయిన IPL బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగింది. 2009లో దాదాపు రూ.17 వేల కోట్ల బ్రాండ్ విలువ కలిగిన ఈ లీగ్ 2023లో తొలిసారి $10 బిలియన్లను తాకగా.. ఇప్పుడు $12 బిలియన్లకు చేరుకుంది. 2024లో 10 జట్ల సమష్టి బ్రాండ్ విలువ 13% పెరగడంతో ప్రస్తుతం $12 బిలియన్లకు చేరుకుందని TOI తెలిపింది. ఇందులో మీడియా రైట్సే రూ.48వేల కోట్లు కావడం గమనార్హం.