News April 1, 2025
పాస్టర్ మృతిపై రెండు రోజుల్లో నివేదిక: హోం మంత్రి

పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అనుమానాస్పద మృతిపై పోలీసులు లోతుగా విచారణ నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోం మంత్రిని రాష్ట్ర పాస్టర్స్ యూనియన్ ప్రతినిధులు కలిసి ప్రవీణ్ మృతిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు.
Similar News
News April 21, 2025
HYD: అర్ధరాత్రి యువతిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువతి ప్రాణాలను పోలీసులు కాపాడారు. స్థానికుల వివరాలు.. రాత్రి 11:30 సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి ఓ యువతి దూకబోయింది. ఇదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్, కృష్ణయ్య అప్రమత్తమయ్యారు. చెరువులో దూకే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకొని బ్రిడ్జి మీదకు తీసుకెళ్లారు. ఆమెను రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.
News April 21, 2025
HYD: అర్ధరాత్రి యువతిని కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువతి ప్రాణాలను పోలీసులు కాపాడారు. స్థానికుల వివరాలు.. రాత్రి 11:30 సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి ఓ యువతి దూకబోయింది. ఇదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు వెంకటేశ్, కృష్ణయ్య అప్రమత్తమయ్యారు. చెరువులో దూకే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకొని బ్రిడ్జి మీదకు తీసుకెళ్లారు. ఆమెను రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.
News April 21, 2025
రోహిత్ ఫామ్లో ఉంటే గేమ్ నుంచి ప్రత్యర్థి ఔట్: హార్దిక్

రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని MI కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశారు. అతను మంచి టచ్లోకి వస్తే ప్రత్యర్థి టీమ్ గేమ్ నుంచి ఔటైపోతుందని వ్యాఖ్యానించారు. CSKతో మ్యాచ్లో హిట్ మ్యాన్, సూర్య భాగస్వామ్యంతో విజయం తమవైపు వచ్చిందని చెప్పారు. తమ బౌలర్లు కూడా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారని కొనియాడారు. కాగా CSKపై రోహిత్ 76* రన్స్ చేసిన విషయం తెలిసిందే.