News February 4, 2025
పాస్వర్డ్ను ఎవరికీ షేర్ చేయవద్దు: అన్నమయ్య పోలీసులు

మీ పాస్వర్డ్ను ఎవరికీ షేర్ చేయవద్దు, సురక్షిత బ్రౌజింగ్ను చేయండని అన్నమయ్య పోలీసులు సూచిస్తున్నారు. ఒక్క అజాగ్రత్త క్లిక్ మీ సమాచారాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. మీరు క్లిక్ చేసే ముందు ఆలోచించండి, యాప్లు, సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేయడం మానుకోండని అవగాహన కల్పించారు. ప్రతి దానిని అనుమానంగా చూడాలన్నారు. మీరు ఏమి పోస్ట్ చేస్తారో అది ఇంటర్నెట్లో ఎప్పటికీ అలానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 1, 2025
సిరిసిల్ల: కొత్త యాజమాన్యాలు చేతికి మద్యం దుకాణాలు

రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాలు కొత్త యాజమాన్యాల నిర్వహణలోకి వచ్చాయి. Dec 1 నుంచి జిల్లాలోని 48 దుకాణాల నిర్వహణకు గత నెలలో టెండర్లు నిర్వహించగా, టెండర్ దక్కినవారు సోమవారం ఉదయం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించారు. జిల్లాలో చాలా దుకాణాలు కొత్త వ్యాపారులకు దక్కగా, పాతవారికి కొందరికే అవకాశం లభించింది. ఈ క్రమంలో మద్యం వ్యాపారులు వారికి గుడ్విల్ ఇచ్చి తిరిగి దుకాణాలను దక్కించుకున్నారు.
News December 1, 2025
జగిత్యాల: ‘వయోవృద్ధుల డిమాండ్లు తక్షణం నెరవేర్చాలి’

సీనియర్ సిటిజన్స్ డిమాండ్లు త్వరగా పరిష్కరించాలని టాస్కా జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జగిత్యాల టాస్కా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇవ్వాలని, హెల్ప్లైన్ను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
News December 1, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

AP: దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. అయితే తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో యథావిధిగా విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు.


