News April 12, 2025
పా.గో: రూ.కోట్లలో వసూళ్లు.. ఒకరికి రిమాండ్: CID

కామవరపుకోట మండలం తడికలపూడి హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ నందిగం ధర్మరాజును రాజమండ్రి CID పోలీసులు నిన్న అరెస్టు చేశారు. స్కూల్ నిర్వాహకులు నందిగం రాణి- ధర్మరాజు 15 మందిని మోసగించి రూ.కోట్లలో వసూలు చేశారని CID డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ కేసులో 3వ నిందితుడైన ధర్మరాజును అరెస్టు చేసి గుంటూరు జైలుకు రిమాండ్లో తరలించామన్నారు. అటు రూ.14.74కోట్ల ఆస్తి జప్తు చేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు.
Similar News
News December 9, 2025
‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్ సంజీవ్లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.
News December 9, 2025
ఆచంటలో ఈనెల 10 జాబ్ మేళా..!

ఈనెల 10న ఆచంట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్ తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. ప్రముఖ కంపెనీల్లో 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 18-35 సంవత్సరాల వయసు, పదో తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు.
News December 9, 2025
ఆచంటలో ఈనెల 10 జాబ్ మేళా..!

ఈనెల 10న ఆచంట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్ తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. ప్రముఖ కంపెనీల్లో 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 18-35 సంవత్సరాల వయసు, పదో తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు.


