News March 4, 2025
పించన్ల పంపిణీలో అల్లూరి జిల్లా ప్రథమ స్థానం

పెన్షన్ల పంపిణీలో అల్లూరి జిల్లా మళ్లీ ప్రథమ స్థానం సాధించిందని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం పాడేరు కలెక్టరేట్లో ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,22,907 మంది లబ్ధిదారులు ఉండగా 1,21,453 మందికి పంపిణీ చేసి 98.82 శాతంతో పంపిణీతో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గత ఆరు నెలలుగా వరుసగా మొదటి స్థానం సాధిస్తూ వస్తున్న జిల్లా 7వ సారి కూడా మొదటి స్థానంలో నిలవడంతో అధికారులను అభినందించారు.
Similar News
News December 8, 2025
ఉత్తమ ఫలితాలు సాధించాలి: సూర్యాపేట కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో కనీసం 70 శాతానికి పైగా మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులను కోరారు. చిన్ననేమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్లో చదువుకుంటున్న విద్యార్థులతో సిలబస్ పూర్తి అయిందా?, వార్షిక పరీక్షలకు ఎలా చదువుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.
News December 8, 2025
TG గ్లోబల్ సమ్మిట్.. మంత్రులు ఏమన్నారంటే?

* ఫీనిక్స్ పక్షి మాదిరిగా వివిధ రంగాల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా TGని మారుస్తాం: శ్రీధర్ బాబు
* రాష్ట్రాన్ని ప్రపంచ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం: రాజనర్సింహ
* పర్యావరణం, ప్రజారోగ్యం, ఇంధన భద్రత కోసం క్లీన్ మొబిలిటీకి ప్రాధాన్యం: పొన్నం
* పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తాం: జూపల్లి
* 2047నాటికి మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 90శాతానికి పెంచడమే లక్ష్యం: సీతక్క
News December 8, 2025
KNR: ఫిబ్రవరి 2 నుంచి అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షలు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్, ద్వితీయ సంవత్సరం థర్డ్ సెమ్, ప్రథమ సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం అవుతాయని అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం సత్య ప్రకాష్ తెలిపారు. పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించుటకు గడవు ఈనెల 27 వరకు ఉందని పేర్కొన్నారు. పరీక్షా సమయం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని తెలిపారు.


