News January 31, 2025
పింఛన్లకు రూ.114 కోట్లు మంజూరు

శ్రీ సత్యసాయి జిల్లాలో రేపు జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం మధ్యాహ్నంలోపు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. 32 మండలాల్లోని లబ్ధిదారులకు రూ.114 కోట్లను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. పింఛన్ పంపిణీని ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజవర్గ, మండల స్థాయిలో రేపు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News February 9, 2025
కుంటాల గ్రామంలో సగానికి పైనే అమ్మవారి పేర్లు

కుంటాలలో సుమారు నాలుగువేల పైచిలుకు జనాభా ఉంది. తమ కోరికలు తీరుతుండటంతో ఊరిలో సగం మంది తమ పిల్లలకు అమ్మవారి పేరు పెట్టుకుంటున్నారు. ఇంట్లో పాప జన్మిస్తే గజ్జలమ్మ, గజ్జవ్వ బాబు జన్మిస్తే గజ్జయ్య, గజేందర్ గజ్జరామ్ అని నామకరణం చేస్తారు. కాగా సంతానం కలగకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్న, వ్యాపారంలో కలిసి రాకపోయినా, వ్యవసాయంలో నష్టాలు వచ్చిన, గజ్జలమ్మ దేవికి మొక్కుకుంటే ఆ కోరికలు తీరుతుందని భక్తుల నమ్మకం.
News February 9, 2025
కాలేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

కాలేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాలేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.
News February 9, 2025
NZB: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.