News August 31, 2024
పింఛన్లు పంపిణీలో రాష్ట్రంలోనే సిక్కోలు ప్రథమ స్థానం

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో భాగంగా రాష్ట్రంలోనే ముందుగా పింఛన్లు పంపిణీ చేసి శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని డీఆర్డీఏ పీడీ పి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం మంత్రి అచ్చెన్నాయుడితో రావివలసలో పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకే 90.68 శాతం పింఛన్లు పంపిణీ చేసి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఆయన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
Similar News
News October 24, 2025
తిలారు: రైలు ఢీకొని ఒకరు మృతి

తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో డౌన్ లైన్లో రైలు ఢీకొని శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి 45 ఏళ్లు ఉంటాయాని, నీలం రంగు హాఫ్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని తెలియజేశారు. ఆచూకీ తెలిసినవారు 91103 05494 నంబర్ను సంప్రదించాలన్నారు.
News October 24, 2025
SKLM: డైట్లో పోస్టులకు ఈ నెల 29 లాస్ట్ డేట్

వమరవెల్లిలోని ప్రభుత్వ జిల్లా శిక్షణ సంస్థ (డైట్లో) డిప్యూటేషన్పై లెక్చరర్లు పోస్టులు భర్తీ చేసేందుకు అక్టోబర్ 29న ఆఖరి తేదీని జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు పేర్కొన్నారు. డిప్యూటేషన్పై ముగ్గురు సీనియర్ లెక్చరర్లు, 8 మంది సాధారణ లెక్చరర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. ZP మున్సిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే అర్హులన్నారు.
News October 24, 2025
ఇళ్ల కోసం అర్హులను గుర్తించండి: మంత్రి ఆదేశాలు

నవంబర్ 5లోగా ఆన్లైన్లో ఇళ్ల కోసం కోసం దరఖాస్తు చేసుకొని విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని సూచించారు. అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు.


