News July 29, 2024
పింఛన్లు పంపిణీ 1వ తేదీ శతశాతం జరగాలి- కలెక్టర్

గతంలో ఎదురైన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ 1వ తేదీ నాడే శతశాతం జరగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 1వ తేదీ ఉదయం 5.30కి పంపిణీ ప్రారంభించి మొదటి రోజునే శత శాతం పంపిణీ జరగాలన్నారు.
Similar News
News November 16, 2025
SKLM: ‘క్రమశిక్షణ సమర్ధతతో కోర్టు కానిస్టేబుల్లు పనిచేయాలి’

క్రమశిక్షణ, సమర్ధతతో కోర్టు కానిస్టేబుళ్లు పనిచేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత కానిస్టేబుల్లతో సమావేశం నిర్వహించారు. కేసుల ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సమయంలో లోపాలు లేకుండా చూడాలని పబ్లిక్ ప్రాసెక్యూటర్లతో సమన్వయం ముఖ్యమన్నారు. రిఫర్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సమన్లు, వారంట్లు అమలులో ఆలస్యం జరగరాదాన్నారు. DCRB సీఐ శ్రీనివాస్ ఉన్నారు.
News November 15, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➤SKLM: క్రమశిక్షణ సమర్థతతో కోర్టు కానిస్టేబుళ్లు పనిచేయాలి
➤వ్యవసాయ రంగంలో AI వినియోగం: మంత్రి అచ్చెన్నాయుడు
➤పలాస, నరసన్నపేటలో 33 కేజీలు గంజాయి స్వాధీనం..నిందితులు అరెస్ట్
➤టెక్కలి: కంటి శస్త్ర చికిత్స విఫలం.. చూపు కోల్పోయిన వృద్ధుడు
➤సోంపేట: చెరువులో మునిగి యువకుడు మృతి
➤ఇచ్ఛాపురం: మత్స్యకారులు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
➤జిల్లాలో పలుచోట్ల ప్రారంభమైన వరి కోతలు
News November 15, 2025
ఎచ్చెర్ల: ‘వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం’

వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరిన్ అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మహిళా గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థినులకు వ్యక్తిగత పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రక్తహీనత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసర ప్రాంతాల పరిశుభ్రంగా ఉండాలన్నారు.


