News April 4, 2025
పింఛన్ కోసం వచ్చే మహిళను గర్భవతిని చేశాడు..!

పింఛన్ కోసం వచ్చిన చెవి, మూగ మహిళను ఓ వ్యక్తి గర్భవతిని చేసిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో జరిగింది. సుబ్లేడులో మినీ ఏటీఎం నిర్వహిస్తున్న కామళ్ల వీరవయ్య వద్దకు ఆయన బంధువైన మహిళ పింఛన్ కోసం వచ్చేది. ఈ క్రమంలో వీరయ్య అమెను నమ్మించి గర్భవతిని చేశాడు. విషయం తెలిసి బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరయ్యను రిమాండ్కు తరలించారు.
Similar News
News April 13, 2025
వర్షంతో నష్టపోయిన రైతులకు సహాయం: మంత్రి తుమ్మల

ఆకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా పంట నష్టాలను ఎదుర్కొన్న రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించనున్నట్లు సమాచారం. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడించారు. నష్టపోయిన రైతుల వివరాలను సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
News April 13, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

1) ఖమ్మం: నేడు పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు 2) మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన 3) వల్లభిలో అంబేద్కర్ విగ్రహావిష్కరించనున్న మందకృష్ణ మాదిగ 4) కూసుమంచిలో మంత్రి పొంగులేటి పర్యటన 5) ఏన్కూరు వ్యవసాయ మార్కెట్కు సెలవు 6) ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం 7) ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన 8) బేతుపల్లి అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు.
News April 13, 2025
ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

ఖమ్మం జిల్లాలో శనివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ముదిగొండ మండలం బాణాపురంలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ఎర్రుపాలెంలో 43.2, ఖమ్మం(U) ఖానాపురం PS, ఖమ్మం(R) పల్లెగూడెం, వైరాలో 43.0, మధిరలో 42.9, బచ్చోడులో (తిరుమలాయపాలెం) 42.6, తల్లాడలో 42.5, ఏన్కూరులో 42.1, కొణిజర్ల 42.0, రఘునాథపాలెం 41.5, కల్లూరు, పెనుబల్లిలో 39.9 నమోదైంది.