News September 1, 2024
పిఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు లక్ష్మణ్ ఎన్నిక.. హర్షం

పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుండు లక్ష్మణ్ ను పిఆర్టియు మెదక్ జిల్లా సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ, అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులు మల్లారెడ్డి, రవి కుమార్, చంద్రశేఖర్, సంతోష్ హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 30, 2025
ఎస్పీని సన్మానించిన బాధిత కుటుంబీకులు

మెదక్ పట్టణంలో పెళ్లిరోజు జరిగిన బంగారం చోరీని ఛేదించిన పోలీసులను అభినందిస్తూ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావును బాధితులు సన్మానించారు. పెళ్లిరోజు పది తులాల బంగారం చోరీకి గురికాగా, సీఐ మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి కోర్టు ద్వారా బంగారు ఆభరణాలు అందజేశారు. బాధిత కుటుంబం ఎస్పీని కలిసి శాలువాతో సన్మానించింది.
News November 30, 2025
ఎస్పీని సన్మానించిన బాధిత కుటుంబీకులు

మెదక్ పట్టణంలో పెళ్లిరోజు జరిగిన బంగారం చోరీని ఛేదించిన పోలీసులను అభినందిస్తూ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావును బాధితులు సన్మానించారు. పెళ్లిరోజు పది తులాల బంగారం చోరీకి గురికాగా, సీఐ మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి కోర్టు ద్వారా బంగారు ఆభరణాలు అందజేశారు. బాధిత కుటుంబం ఎస్పీని కలిసి శాలువాతో సన్మానించింది.
News November 30, 2025
మెదక్: ‘నిర్భయంగా బయటకు రండి’

మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తాయని మెదక్ ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు తెలిపారు. వేధింపులకు గురవుతున్నవారు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మెదక్ డివిజన్లో 5 ఎఫ్ఐఆర్లు, 8 ఈ-పిట్టి కేసులు, తూప్రాన్ డివిజన్లో 3 ఎఫ్ఐఆర్లు, ఈ-పిట్టి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.


