News September 1, 2024

పిఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు లక్ష్మణ్ ఎన్నిక.. హర్షం

image

పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుండు లక్ష్మణ్ ను పిఆర్టియు మెదక్ జిల్లా సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ, అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులు మల్లారెడ్డి, రవి కుమార్, చంద్రశేఖర్, సంతోష్ హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 26, 2025

మెదక్: ఏడుపాయల టెండర్ ఆదాయం రూ.3.75 లక్షలు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం కార్యాలయంలో బుధవారం మహా శివరాత్రి జాతర సీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. ఈఓ చంద్రశేఖర్, మెదక్ జిల్లా దేవాదాయ శాఖ పరివేక్షకుడు వెంకట రమణ సమక్షంలో వేలం జరిగింది. జాతరలో కొబ్బరి ముక్కలు పోగు హక్కు రూ.3.75 లక్షలకు నాగ్సాన్‌పల్లి పి.మల్లేశం దక్కించుకున్నారు. మిగతా టెండర్లకు సరైన పాటలు రాక వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు.

News November 26, 2025

MDK: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: SEC

image

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీసీ నిర్వహించి, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. టి-పోల్‌లో రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు అప్‌డేట్ చేయాలని, ఫిర్యాదులు మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నామినేషన్లు నవంబర్ 27–29 స్వీకరణపై మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పారు.

News November 26, 2025

మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

image

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.