News April 10, 2025

పిటిషన్లపై సత్వర చర్యలకు కృషి: KMR SP

image

ప్రజలు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు ఇస్తున్న సందర్భంలో పూర్తి చిరునామా, మొబైల్ నంబర్‌ను స్పష్టంగా పేర్కొనాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారుల పట్ల పారదర్శకత, వేగవంతమైన స్పందన, ప్రజలతో సమర్థమైన సమాచార పంపిణీ కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల సహకారంతో పోలీసు శాఖ మరింత సమర్థంగా సేవలందించగలదని వెల్లడించారు.

Similar News

News November 16, 2025

కల్వకుర్తి: తెలకపల్లి బస్సు పునః ప్రారంభం

image

భారీ వర్షాల నేపథ్యంలో దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల కల్వకుర్తి నుంచి రఘుపతి పేట మీదుగా తెలకపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. దుందుభి వాగులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆర్టీసీ బస్సులను పునః ప్రారంభించారు. డీఎం సుభాషిని శనివారం దుందుభి వాగును పరిశీలించిన అనంతరం ఆదివారం ఉదయం బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News November 16, 2025

ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా

image

అదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బజార్‌హత్నూర్ 8.4°C, పొచ్చర 9, సత్నాల 9.5, సోనాల 9.6, పిప్పల్ దారి 9.8, అర్లి(T) 9.9, ఆదిలాబాద్ అర్బన్ 10.1, తలమడుగు 10.3, రామ్ నగర్ 10.4, భరంపూర్ 10.7, తాంసి 10.8, గుడిహత్నూర్ 11.3, హీరాపూర్ 11.4, సిరికొండ 11.6, ఇచ్చోడ, ఉట్నూర్(X రోడ్) 12.4°C లుగా నమోదయ్యాయి.

News November 16, 2025

తిరుమలలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా?

image

స్వామివారి పుష్కరిణికి వాయువ్యంలో ఉన్న వరాహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని పైకెత్తారు. ఆయన అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశారు. అందుకే, తిరుమలలో తనను దర్శించుకునే భక్తులందరూ ముందుగా భూవరాహస్వామిని దర్శించుకుంటారని శ్రీనివాసుడు చెప్పారు. ఇప్పటికీ శ్రీవారి దర్శనానికన్నా ముందు దర్శనం, నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>