News October 31, 2024

పిట్టలవానిపాలెం: రైలు ఢీకొని తల్లి, కూతురు దుర్మరణం

image

పిట్టలవానిపాలెం మండలంలోని అల్లూరు గ్రామం నత్తలవారిపాలెంలో పండుగ రోజు విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లూరు గ్రామానికి చెందిన వజ్రమ్మ, ఆమె కూతురు శిరీష నెల్లూరు జిల్లా కావలిలో గురువారం తెల్లవారు జామున రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో అల్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News October 27, 2025

గుంటూరు జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

image

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పోలీస్ (24×7) కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
@జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0863-2230100
@ఈస్ట్ సబ్‌డివిజన్–0863-2223353
@వెస్ట్ సబ్‌డివిజన్– 0863-2241152 / 0863-2259301
@నార్త్ సబ్‌డివిజన్–08645-237099
@సౌత్ సబ్‌డివిజన్–0863-2320136
@తెనాలి సబ్‌డివిజన్–08644-225829
@తుళ్లూరు సబ్‌డివిజన్–08645-243265

News October 27, 2025

ANU పరిధిలోని కాలేజీలకు సెలవు

image

గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మొంథా తుఫాను నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలకు ఈ నెల 29 వరకు మూడు రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తెలిపారు. ఈ ఆదేశాలను తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News October 27, 2025

ANU: పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీజీ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల మూడో సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లై) పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలు నవంబర్‌ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజు చెల్లింపుకు చివరి తేది నవంబర్‌ 3, రూ.100 జరిమానాతో నవంబర్‌ 6 వరకు అవకాశం. గ్యాలీలు నవంబర్‌ 4లోపు సమర్పించాలి. ఆన్‌లైన్ ద్వారా ఇంటర్నల్స్/మూక్‌లు/ప్రాక్టికల్ మార్కులను సమర్పించడానికి చివరి తేదీ: 15-12-2025