News January 12, 2025
పిట్లం: ఏటీఎం ధ్వంసం చేసి చోరీ

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని వారు తెలిపారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 15, 2025
PCC చీఫ్ సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలి: MP

రాష్ట్ర PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ROB నిధులపై సరైన అవగాహన లేదని, ముందుగా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలని నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి సూచించారు. బుధవారం MP మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం BJPపై బురద జల్లి BRSను కాపాడే ప్రయత్నం చేస్తుందని, కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసి అవకతవకలు ఉన్నాయని తేలినా ఏమి చేయలేదన్నారు.
News October 15, 2025
నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తా: MP

NZB జిల్లాలోని ROBలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే వారంలో నిరాహార దీక్ష చేపడుతానని MP ధర్మపురి అర్వింద్ ప్రకటించారు. BJP జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. అడవి మామిడిపల్లి ఆర్ఓబీకి రూ.22 కోట్లు అవసరమైతే, కొన్ని ఏళ్ల క్రితమే సుమారు రూ.18 కోట్లు డిపాజిట్ చేయగా గత ప్రభుత్వం నిధులను మళ్లించిందన్నారు. మాధవ్ నగర్ ఆర్ఓబీకి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 70% వచ్చాయన్నారు.
News October 15, 2025
NZB: మీ పశువులకు టీకాలు వేయించండి

జిల్లాలో గేదెలు, దూడలు, ఆవులు, లేగలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను నేటి నుంచి నవంబర్ 14 వరకు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఉన్న 1.97 లక్షల పశువులకు ఏడో విడతలో భాగంగా నెల రోజుల పాటు గ్రామాల్లో ఉచితంగా టీకాలు వేస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువులకు టీకాలు వేయించాలని కోరారు.