News February 26, 2025

పిట్లం: కన్న తల్లిని చంపేశారు.. కారణమేంటో..?

image

నవమాసాలు మోసింది. పెంచి పెద్ద చేసింది. బిడ్డ కడుపు నిండితే తను సంతోషించింది. వృద్ధాప్యంలో తోడుగా నిలవాల్సిన తనయులె ఆ తల్లి పాలిట యముడయ్యారు. రోకలిబండతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లంలో మంగళవారం వెలుగు చూసింది. తల్లి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలే కారణంగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఎందుకు హత మార్చారో కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 26, 2025

మద్యం షాపులకు రేపు లక్కీ డ్రా

image

TG: మద్యం దుకాణాలకు రేపు ఉదయం 11 గంటలకు లక్కీ డ్రాలు తీయనున్నారు. జిల్లాల వారీగా దరఖాస్తుదారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరగనుంది. మొత్తం 2,620 షాపులకు 95 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్‌కు భారీగా డిమాండ్ నెలకొంది. శంషాబాద్ పరిధిలో అత్యధికంగా 100 దుకాణాలకు 8,536, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7,845 దరఖాస్తులు రావడం గమనార్హం.

News October 26, 2025

6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్ ఇంటర్నల్స్

image

హనుమకొండలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు సెకండియర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న ఒక తెలిపారు. ఇతర వివరాల కోసం 99894 17299, 9989 139136 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News October 26, 2025

చిన్నశంకరంపేట: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గవలపల్లి ఎక్స్ రోడ్డులోని వైన్స్ పర్మిట్ రూమ్ ఎదురుగా అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అంబాజీపేట గ్రామానికి చెందిన బండారు వెంకటేశం(40)గా గుర్తించారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ చేరుకొని దర్యాప్తు చేపట్టారు.