News September 22, 2024
పిట్లం: నీటి కుంటలో పడి రైతు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందిన ఘటన పిట్లం మండలం కారేగాంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కారేగాం గ్రామానికి చెందిన బేగరి దశరథం (55) తన పంట పొలానికి నీటిని తోడేందుకు మోటారును పెద్ద చెరువు కుంటలో వేశాడు. మోటారు మోరాయించడంతో దాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 15, 2025
NZB: పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: సుదర్శన్ రెడ్డి

NZB జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆర్ఓబీ పనుల పురోగతి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News November 15, 2025
నిజామాబాద్: చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు: కవిత

హరీష్ రావు అవినీతి బయటపెట్టినా సరే CM రేవంత్ రెడ్డి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావుకు, సీఎంకు ఏం అండర్ స్టాండింగ్ ఉందో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సరిగా పని చేయకపోతే మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని ఆమె స్పష్టం చేశారు.
News November 15, 2025
NZB: జిల్లా ప్రజలకు సీపీ పలు సూచనలు!

జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య పలు సూచనలు చేస్తూ శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాలలో విగ్రహ ప్రతిష్టలు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ డీజే పూర్తిగా నిషేధం అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దన్నారు. డ్రోన్స్ ఉపయోగించడానికి & భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని కోరారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


