News January 31, 2025

పిట్లం: పాము కాటుతో వృద్ధుడి మృతి..

image

పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు ఒర్రె మొగులయ్య (80) పాముకు కాటుకు గురై ప్రాణాలు వదిలారు. స్థానికుల వివరాలిలా..ఒర్రె మొగులయ్య బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. అదే సమయంలో పాము కాటు వేసింది. వెంటనే చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు వదిలారు.

Similar News

News November 10, 2025

సైబరాబాద్ వ్యాప్తంగా 529 మందిపై కేసు నమోదు

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించారు. 529 మందిపై కేసు నమోదు చేశారు. 417 బైకులు, 24 త్రీ వీలర్స్, 88 కార్లతో పాటు పలు వాహనాలను సీజ్ చేశారు. 20 నుంచి 30 ఏళ్ల వయసు గలిగిన వారే ఎక్కువ శాతం మద్యంతాగి వాహనాలను నడిపినట్లు గుర్తించారు. ఇప్పటికైనా ప్రజలు మారాలని సూచిస్తున్నారు.

News November 10, 2025

అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

image

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.

News November 10, 2025

అవాస్తవాలు ప్రచారం చేయద్దు: పలమనేరు DSP

image

ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తిరుగు ప్రయాణంలో ఇందిరానగర్ వద్ద జరిగిన తోపులాటలో హేమలత అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిని కొంతమంది సోషల్ మీడియాలో కాన్వాయ్ వాహనం ఢీకొనిందని దుష్ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవమని DSP ప్రభాకర్ తెలిపారు. ఎవరైనా ఈ విషయంపై మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.