News January 31, 2025

పిట్లం: పాము కాటుతో వృద్ధుడి మృతి..

image

పిట్లం మండలం బుర్నాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు ఒర్రె మొగులయ్య (80) పాముకు కాటుకు గురై ప్రాణాలు వదిలారు. స్థానికుల వివరాలిలా..ఒర్రె మొగులయ్య బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. అదే సమయంలో పాము కాటు వేసింది. వెంటనే చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు వదిలారు.

Similar News

News October 26, 2025

ADB: గుంజాల శివారులో పెద్దపులి సంచారం

image

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుంజాల గ్రామ శివారులో పెద్ద పులి సంచరించింది. అదివారం పశువుల మేతకి వెళ్లిన రైతులకు పెద్దపులి కంట పడింది. దీంతో రైతులు పరుగులు పెట్టి గ్రామానికి చేరుకున్నారు. భయాందోళన గురైన ప్రజలు అటవీ సిబ్బందికి సమాచారం అందించగా.. పులి అడుగులని నిర్ధారించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్ ఫారెస్ట్ నుంచి తరచూ పులుల రాకతో మండలవాసులు బెంబేలెత్తుతున్నారు.

News October 26, 2025

యాడికి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

image

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్‌పై మోడల్ స్కూల్‌కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 26, 2025

ఏయూ విద్యార్థులకు 2 రోజులు సెలవులు

image

తుఫాన్ నేపథ్యంలో ఏయూ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు ఈనెల 27, 28వ తేదీల్లో తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ కె.రాంబాబు తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 2 రోజులపాటు సెలవులు ప్రకటించామని, విద్యార్థులు హాస్టల్స్‌లో సురక్షితంగా ఉండాలని సూచించారు. అటు అనకాపల్లి జిల్లాలో 29 వరకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు.